భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆదివారం ఆట ముగిసింది. ఈరోజు మొత్తం స్కోరు 224/3తో ఫస్ట్ ఇన్నింగ్స్ని కొనసాగించిన టీమిండియాలో ఓపెనర్ రోహిత్ శర్మ (212 పరుగులు : 255 బంతుల్లో 28×4, 6×6) డబుల్ సెంచరీ బాదగా, వైస్ కెప్టెన్ అజింక్య రహానె(115 బంతుల్లో 192 బంతుల్లో 17×4, 1×6) శతకం సాధించాడు. దీంతో.. టీ విరామానికి ముందు భారత్ మొదటి ఇన్నింగ్స్ని విరాట్ కోహ్లీ 497/9 వద్ద డిక్లేర్ చేశాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఈ రోజు వెలుతురులేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 9/2తో నిలిచింది. ఆ జట్టు మెదటి ఇన్నింగ్స్లో ఇంకా భారత్ కంటే 488 పరుగులు వెనకబడి ఉండగా క్రీజులో కెప్టెన్ డుప్లెసిస్(1), హజ్మా(0) ఉన్నారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్(0)ని పేసర్ మహ్మద్ షమీ ఔట్ చేయగా.. రెండో ఓవర్లో చివరి బంతికి మరో ఓపెనర్ డికాక్(4)ని ఉమేశ్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇద్దరూ బౌన్సర్ బంతుల్ని ఆడే ప్రయత్నంలో వికెట్ కీపర్ సాహాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతానికి రాంచీలో ఇది చాలా దిగులుగా మారింది మరియు భారతదేశం వారి స్పిన్నర్లను మాత్రమే బౌలింగ్ చేయాలని ఎంచుకున్నప్పటికీ, అంపైర్లు ఆటగాళ్లను పిలవవలసి వచ్చింది. వారు తిరిగి వస్తారా అనేది చూడాలి. వేచి ఉండండి.
రాంచీ టెస్టులో రెండో రోజూ కూడా ఆఖరి సెషన్లో మ్యాచ్కి అంతరాయం కలిగింది. శనివారం మొత్తం 58 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా.. ఈరోజు ఆఖరి సెషన్లో కేవలం 5 ఓవర్లు ఆటే జరిగింది. రాంచీ టెస్టులో రెండు రోజులు ఆట ముగియగా.. శనివారం మొదటి సెషన్ మినహా.. మొత్తం భారత్ జట్టే ఆధిపత్యం చెలాయించింది. ఈరోజు మొదటి సెషన్లోనే రహానె శతకం సాధించగా.. రెండో సెషన్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఆఖరి సెషన్లో ఆట కొద్దిసేపు మాత్రమే జరగగా.. ఆ కొద్ది సమయంలోనే వరుసగా రెండు వికెట్లు పడగొట్టి భారత బౌలర్లు సఫారీలను ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమయ్యారు. మూడు టెస్టుల సిరీస్ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకున్న భారత్ జట్టు క్లీన్స్వీప్పై కన్నేసింది
Be the first to comment on "భారత్ vs దక్షిణాఫ్రికా 3వ టెస్ట్ 2వ రోజు హైలైట్స్ : దక్షిణాఫ్రికా కంటే 488 పరుగులు ముందంజ లో భారత్"